
- ఇక ఎంఎస్పీ రూ. 2,369..మరో 13 ఖరీఫ్ పంటల మద్దతు ధర హైక్
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
- రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు
- ఏపీలోని బద్వేల్–- నెల్లూరు 4 లేన్ రోడ్డు అభివృద్ధికి
- ఆమోదం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో 2 రైల్వే లైన్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటలకు కేంద్ర సర్కారు మద్దతు ధర పెంచింది. వరికి 3 శాతం, పప్పు ధాన్యాలకు 5.96 శాతం, ఆయిల్ సీడ్స్ ఎంఎస్పీ 9 శాతం హైక్ చేసింది. వరికి మద్దతు ధర రూ. 69 పెంచగా.. క్వింటాల్ ధాన్యం ధర రూ. 2,369కు చేరుకున్నది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నది. 2025–-26 మార్కెటింగ్ సీజన్కు ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరలను పెంచాలని అగ్రికల్చర్ మినిస్ట్రీ చేసిన ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
రైతుల సంక్షేమం కోసం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. ఎంఎస్పీ పెంపుతోపాటు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించినట్టు తెలిపారు. గత 10–-11 ఏండ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ భారీగా పెంచినట్లు తెలిపారు. ఆయా పంటలకు ఎంఎస్పీ కోసం రూ.2.7లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.15,642 కోట్లు కేటాయించగా.. అన్నదాతలకు పెట్టుబడిపై 50 శాతం మార్జిన్ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు..
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) ద్వారా రైతులకు అందించే వడ్డీ రాయితీ పథకం కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ఆమోదం తెలిపింది. 2025-–26 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత 1.5 శాతం వడ్డీ రాయితీతో కొనసాగించనున్నది. ఇందుకోసం రూ. 15,642 కోట్లను కేటాయించింది. అలాగే, ఏపీలోని బద్వేల్-– నెల్లూరు 4 లేన్ రహదారి అభివృద్ధికి ఆమోదం తెలిపింది. రూ.3,653 కోట్లతో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నది. బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మాణం చేపట్టనున్నది. ఈ కారిడార్తో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 కిలోమీటర్లు తగ్గనున్నది.
వీటితోపాటు వార్దా-–బల్లార్షా 4 లేన్, రత్లాం-–నగ్దా మధ్య రైల్వే లైన్కు కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 3,339 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టులు 2029–30 వరకు పూర్తవుతాయని పేర్కొన్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాలను కవర్ చేసే ఈ రెండు ప్రాజెక్టులు ఇండియన్ రైల్వే నెట్వర్క్ను దాదాపు 176 కిలోమీటర్లు
పెంచుతాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఏ పంటకు ఎంత ఎంఎస్పీ పెంచారంటే?
మొత్తం 14 ఖరీఫ్ పంటలకు క్వింటాల్పై ఎంఎస్పీ పెరిగింది. వరి సాధారణ, గ్రేడ్- ఏకు రూ.69 పెంచగా.. జొన్నలు రూ.328, సజ్జలు రూ.150, రాగులు రూ.596, మొక్కజొన్న రూ.175, కందులు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశెనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, నువ్వులు రూ.579, నైజర్సీడ్ రూ.820; పత్తి రూ.589 చొప్పున మద్దతు ధరను పెంచారు.