రేవంత్‌కు ఈటల భారీ ప్యాకేజీ ఇచ్చిండు

రేవంత్‌కు ఈటల భారీ ప్యాకేజీ ఇచ్చిండు

ఈటల రాజేందర్ కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి. ఆస్తులు కాపాడుకునేందుకు రాజీనామా చేసి.. ఇప్పుడు ఆత్మగౌరవం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కు ఈటల రాజేందర్ భారీ ప్యాకేజీ ఇచ్చారన్నారు. దీనిపై చర్చకు ఇల్లందకుంట రాములవారి గుడికి రావాలని ఈటలకు సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి  రాష్ట్రమంతా మీటింగులు పెడుతూ హుజురాబాద్ ను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ ఇక్కడికి ఇప్పటి దాకా రాలేదన్నారు. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లే రోడ్డే సరిగ్గా లేదని.. ఆయనేం అభివృద్ధి చేశారన్నారు.