- అవార్డు వల్ల కడుపు ఎండుతోంది
- కెనాల్ మ్యాన్ ఆఫ్ ఒడిశా ఆవేదన
కెంఝోర్ (ఒడిశా): ఒంటిచేత్తో గుట్టను తొలిచి, కాలువ ఏర్పాటు చేసి పత్రికలకెక్కా డు.. ప్రభుత్వం మెచ్చుకుని పద్మశ్రీతో సన్మానించింది. ఈ అవార్డుతో కష్టాలన్నీ గట్టెక్కుతాయ్ అనుకుంటే కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. అంతకుముందు దొరికే కూలిపని కూడా ఇప్పుడు దొరకడం లేదు. పక్కా ఇళ్లు కట్టించి ఆదుకుంటామన్న నేతలు కంటికే కనపడడంలేదు. ‘కెనాల్ మ్యాన్ ఆఫ్ ఒడిశా’గా గుర్తింపు పొందిన ఆదివాసీ రైతు దైతరీ నాయక్ ఇప్పుడు ఆకలి బాధ తట్టుకోలేక చీమ గుడ్లను తిని కాలం గడుపుతున్నారు. ఒడిశాలోని కెంఝోర్జిల్లాకు చెందిన దైతరీ నాయక్ పంట పొలాలకు నీరందించేందుకు ఒక్కడే గోనసిక కొండలను తొలిచి, మూడు కిలోమీటర్ల పొడవున కాలువ ఏర్పాటు చేశాడు. దీంతో వంద ఎకరాలకు నీరు అందుతోంది. దీంతో స్థానిక గ్రామాల నుంచి దేశ రాజధాని దాకా నాయక్ పేరు మార్మోగిం ది. సన్మానాలు జరిగాయి. ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. ఆ తర్వాతే నాయక్ కు అసలు కష్టాలు మొదలయ్యాయి. అంతగొప్ప అవార్డు పొందిన వ్యక్తికి కూలి పని చెప్పడం మర్యాద కాదంటూ స్థానికులు నాయక్ను పిలవడంలేదు. దీంతో తన కుటుంబం పస్తులుండాల్సి వస్తోందని, ఆకలిబాధ తట్టుకోలేక చీమ గుడ్లను తింటున్నామని నాయక్చెప్పారు. కూలి దొరక్కుం డా చేసిన ఈ అవార్డు నాకొద్దని, దీనిని ప్రభుత్వానికే తిరిగిచ్చేస్తానని నాయక్ అంటున్నారు.