T20 World Cupలో బోణీ కొట్టిన పాకిస్తాన్.. ఈజీ టార్గెట్.. 20 ఓవర్ల లోపే ఫినిష్ !

T20 World Cupలో బోణీ కొట్టిన పాకిస్తాన్.. ఈజీ టార్గెట్.. 20 ఓవర్ల లోపే ఫినిష్ !

T20 World Cup 2026లో పాకిస్తాన్ జట్టు బోణీ కొట్టింది. నెదర్లాండ్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్.. నెదర్లాండ్స్ జట్టును 19.5 ఓవర్లలో 147 పరుగులకు కట్టడి చేసింది. నెదర్లాండ్స్ జట్టు ఏడు వికెట్లు నష్టపోయి పాక్ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 19.3 ఓవర్లకే 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 47 పరుగులతో రాణించాడు. ఫహీమ్ అస్రఫ్ 29 (నాటౌట్), అయూబ్ 24, బాబర్ అజమ్ 15, సల్మాన్ అఘా 12, మహ్మద్ నవాజ్ 6, షాహిద్ అఫ్రీదీ 5 (నాటౌట్)గా నిలిచారు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో స్కాట్ ఎడ్వర్డ్ 37, బాస్ డి లీడే 30, మైకేల్ లెవిట్ 24, ఆర్యన్ దత్ 13 పరుగులు చేశారు. 

ALSO READ : అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంకు బీసీసీఐ క్యాష్ రివార్డ్..

పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జాకు 3 వికెట్లు, మహ్మద్ నవాజ్ 2, అబ్రార్ అహ్మద్ 2, అయూబ్ 2, అఫ్రీదీకి ఒక వికెట్ దక్కింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 2, పాల్ వాన్ మికరెన్కు 2, వాన్ బీక్, కైల్ క్లెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వేకు తలో వికెట్ దక్కింది.