బోర్డర్ లో కాల్పులకు పాల్పడ్డ పాక్ సైనికులు

బోర్డర్ లో కాల్పులకు పాల్పడ్డ పాక్ సైనికులు

సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. అంతేకాదు బోర్డర్ లో ఉద్రిక్తతలను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ(శనివారం) ఉదయం జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న పూంచ్ జిల్లా కృష్ణ ఘరి సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఇందులో ఒక చిన్నారి కూడా ఉంది.

అయితే భారత భద్రతా దళాలు వారి దాడులను సమర్థంగా తిప్పికొట్టారు. మన సైనికులు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించడంతో పాక్ సైనికులు తోక ముడిచారు. మరోవైపు, భారత భూభాగంలోకి ఉగ్రవాదులను జొప్పించేందుకు పాక్ సైన్యం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సరిహద్దుల్లో భారత బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి.