డెడ్ స్టోరేజీకి చేరువలో పాలేరు

డెడ్ స్టోరేజీకి చేరువలో పాలేరు

కూసుమంచి, వెలుగు : ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా శనివారం నాటికి 12 అడుగులకు చేరుకుంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 11 అడుగులు కావడంతో మరో 6 నుంచి 10 రోజుల వరకే తాగునీటి సరఫరా జరిగే అవకాశం ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం డెడ్ స్టోరీకి చేరితే మిషన్ భగీరథ మోటార్లకు నీరు అందదు. దీంతో సరఫరా నిలిచిపోనుంది.

నాగార్జునసాగర్, ఎస్సారెస్సీ నుంచి కూడా ఇన్​ఫ్లో రాకపోవడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. జూన్ వరకు తాగునీటి సరఫరా చేయాలంటే మరో 2 టీఎంసీల నీరు అవసరం.