జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభధ్రుల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. తనకు పట్టభధ్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్, గెలిపించిన పట్టబధ్రులకు కృతజ్ఞతలు తెలిపారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.
బీఆర్ఎస్ తరపున నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుండి 2015, 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందారు పల్లా రాజేశ్వర్ రెడ్డి . అంతకుముందు పాడి కౌషిక్ రెడ్డి, కడియం శ్రీహరిలు కూడా తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.