- జెండర్ సెన్సివిటీ, బాల్యవివాహాల నివారణపై చర్చ
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 20న అన్ని బడుల్లో పేరెంట్స్, టీచర్ల మీటింగ్ నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీచేశారు. సమావేశంలో జెండర్ సెన్సివిటీ, ఈక్వాలిటీ, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై చర్చించాలని డీఈఓలకు ఉత్తర్వులు ఇచ్చారు. మీటింగ్కు మహిళా స్ర్తీ శిశు సంక్షేమశాఖ నుంచి స్థానిక ప్రతినిధిని ఆహ్వానించాలని తెలిపారు. కార్యక్రమంపై పేరెంట్స్ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.