
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 20న అన్ని గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఏం) నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ మీటింగ్ కు వందశాతం పేరెంట్స్ అటెండ్ అయ్యేలా చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
సర్కారు బడుల్లో ఎన్ రోల్ పెంపు, వారి పిల్లల అటెండెన్స్ పెంపుపై వారితో చర్చించాలని సూచించారు. ప్రతినెలా మూడో శనివారం పీటీఏం నిర్వహించాలని ఆదేశించారు. పీటీఏం డేటా, ఫొటోలను తెలంగాణ స్కూల్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.