26వ సారి ఎవరెస్ట్​ఎక్కిన దావా షెర్పా

26వ సారి ఎవరెస్ట్​ఎక్కిన దావా షెర్పా

కాఠ్మండు: నేపాల్​కు చెందిన పసాంగ్ దావా షెర్పా ఆదివారం ఉదయం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని షెర్పా ఎక్కడం ఇది 26వసారి. సహచర నేపాలీ గైడ్​ కమీ రీటా రికార్డును దావా సమం చేశాడు. షెర్పా హంగేరియన్ అధిరోహకుడితో కలిసి శిఖరాన్ని చేరుకున్నట్లు ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్ యాత్ర నిర్వాహకులు తెలిపారు.  

1998లో శిఖరాన్ని అధిరోహించిన అనంతరం దావా ప్రతి ఏడాది ఎవరెస్ట్​ను ఎక్కినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సీనియర్​ గైడ్ కమీ రీటా గత సంవత్సరం 26వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తొలిసారి రికార్డును నెలకొల్పాడు.