కాఠ్మండు: నేపాల్కు చెందిన పసాంగ్ దావా షెర్పా ఆదివారం ఉదయం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని షెర్పా ఎక్కడం ఇది 26వసారి. సహచర నేపాలీ గైడ్ కమీ రీటా రికార్డును దావా సమం చేశాడు. షెర్పా హంగేరియన్ అధిరోహకుడితో కలిసి శిఖరాన్ని చేరుకున్నట్లు ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్ యాత్ర నిర్వాహకులు తెలిపారు.
1998లో శిఖరాన్ని అధిరోహించిన అనంతరం దావా ప్రతి ఏడాది ఎవరెస్ట్ను ఎక్కినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సీనియర్ గైడ్ కమీ రీటా గత సంవత్సరం 26వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తొలిసారి రికార్డును నెలకొల్పాడు.