మహేష్ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ప్లానింగ్ అదుర్స్

మహేష్ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ప్లానింగ్ అదుర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఉండటంతో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి.

అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ న్యూస్ విని అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. అదేంటి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎందుకు  హ్యాప్పీగా ఫీలవుతున్నారు అనుకుంటున్నారా? అదే ట్విస్ట్. గుంటూరు కారం సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన గాత్రాన్ని అందిస్తున్నారట. ఈ సినిమా పవన్ కళ్యాణ్(Pawan kalyan) వాయిస్ ఓవర్ తోనే మొదలవుతుందట.ఈ క్రేజీ అప్డేట్ తో గుంటూరు కారం సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇప్పటికే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. ఇంత కాలం తరువాత పవన్ కళ్యాణ్  మహేష్ బాబు సినిమాకు తన వాయిస్ ఓవర్ ను అందిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలకు దర్శకుడు త్రివిక్రమే. మరి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మహేష్ బాబు ఎంట్రీ ఎలా ఉండబోతుందో? అని ఫ్యాన్స్ ఇప్పటినుండే అంచనాలు పంచుతున్నారు.

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.