తిరువనంతపురం: కేరళలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం 'ప్రియదర్శిని' స్కీమ్ను సోమవారం (జూన్ 16) లాంఛనంగా ప్రారంభించింది. ఈ స్కీమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన కేరళ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి బిందు కృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. రద్దీగా ఉన్న బస్సులో ఆమెపై వేడి వేడి పాయసం (ఖీర్) పడింది.
ఒక్కసారిగా వేడి వేడి పాయసం మీద పడటంతో మంత్రి బిందు తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన మంత్రి రక్షణ సిబ్బంది, కార్యకర్తలు ఆమెకు సహయపడ్డారు. అనంతరం మంత్రి కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలు తెలిపారు.
కేరళలో ఉచిత బస్సు ప్రయాణ పథకం:
అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్ జెండర్లకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని యూడీఎఫ్ కూటమి హామీ ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యూడీఎఫ్ కూటమి ఇచ్చిన మాట ప్రకారం.. 2026, జూన్ 16 నుంచి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ముఖ్యమంత్రి వీడీ సతీసన్ ఈ స్కీమ్ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మహిళలు, యువత ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి బలమైన, మరింత సమ్మిళితమైన కేరళను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Watch: 𝐊𝐞𝐫𝐚𝐥𝐚 𝐘𝐨𝐮𝐭𝐡 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬 𝐜𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐞𝐝 𝐭𝐡𝐞 𝐏𝐫𝐢𝐲𝐚𝐝𝐚𝐫𝐬𝐡𝐢𝐧𝐢 𝐛𝐮𝐬 𝐥𝐚𝐮𝐧𝐜𝐡 𝐛𝐲 𝐝𝐢𝐬𝐭𝐫𝐢𝐛𝐮𝐭𝐢𝐧𝐠 𝐤𝐡𝐞𝐞𝐫.
— FalconUpdatesHQ (@FalconUpdatesHQ) June 15, 2026
It accidentally spilled onto Minister Bindu’s head 😵💫
Bindu Krishna is Kerala’s Dairy Development Minister. pic.twitter.com/EG3Oi4vigZ
