ముంబై: పేటీఎం షేర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ స్టాక్ ధర మంగళవారం లైఫ్టైం లోకి చేరి రూ.550.50 వద్ద ముగిసింది. తాజా మరో మూడుశాతం నష్టపోయింది. ఇన్వెస్టర్లకు పేటీఎం షేరుపై నమ్మకం తగ్గిపోవడంతో బేరిష్ ట్రెండ్ కనిపిస్తోంది. పేటీఎం ఇష్యూ ధర రూ.2,150 కాగా, ఇప్పటి వరకు 75 శాతం పడిపోయింది. పేటీఎం గురించి నెగటివ్ వార్తలు రావడంతో గత నెల నుంచే 32 శాతం నష్టపోయింది. ఈ స్టాక్ గత నవంబరు 18న ఇంట్రాడే ట్రేడ్లో రికార్డ్ హై రూ.1,961.02లకు చేరింది. ఇప్పటికి వరకు ఏనాడూ లిస్టింగ్ ధరను అందుకోలేకపోయింది.
గత నాలుగు నెలల్లో పేటీఎం మార్కెట్క్యాప్ రూ.1.03 లక్షల కోట్లు నష్టపోయి రూ.35,500 కోట్లకు చేరుకుంది. చాలా బ్రోకరేజీలు పేటీఎం షేరు ప్రైస్ టార్గెట్ను తగ్గించాయి. ధర మరింత పడొచ్చని చెబుతున్నాయి. కొన్ని రీసెర్స్ సంస్థలు ఈ షేర్ వ్యాల్యూను తగ్గించి... టార్గెట్ ఇచ్చాయి. ఆ టార్గెట్లను కూడా దాటి మరీ తగ్గడంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. పేటీఎం షేర్ల పతనంపై బీఎస్ఈ కూడా స్పందించింది. స్టాకులు ఇంతగా ఎందుకు తగ్గుతున్నాయో వివరణ ఇవ్వాలని పేటీఎంను ఆదేశించింది.