![7 వేలకు చేరిన అగ్రి స్టార్టప్లు](https://static.v6velugu.com/uploads/2024/05/45_VyXJ5TCf2t.jpg)
న్యూఢిల్లీ : గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాలలో స్టార్టప్ల సంఖ్య ఏడు వేలకు పెరిగిందని ఒక రిపోర్టు తెలిపింది. వ్యాపార వాతావరణం బాగుండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. 2014-–15కి ముందు, వ్యవసాయం అనుబంధ రంగాలలో 50 కంటే తక్కువ స్టార్టప్లు ఉన్నాయని ‘ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చర్' పేరుతో అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఎఫ్ఏఐఎఫ్ఏ) విడుదల చేసిన రిపోర్ట్ పేర్కొంది. వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద 'ఇన్నోవేషన్ అండ్ అగ్రి- ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్' ప్రోగ్రామ్ను 2018–-19 నుంచి అమలు చేస్తోంది. ఇన్నోవేషన్, అగ్రి- ఆంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక సహకారం అందించడం దీని లక్ష్యం. 2018–-19లో దేశవ్యాప్తంగా స్టార్టప్ల ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ను అమలు చేయడం కోసం డిపార్ట్మెంట్ ద్వారా ఐదు నాలెడ్జ్ పార్ట్నర్లు (కేపీలు)
24 ఆర్కేవీవై- అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్లు (ఆర్ఏబీఐలు) ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం దశాబ్దకాలంగా చేస్తున్న ప్రయత్నాలను నివేదిక మెచ్చుకుంది. రైతుల ఆదాయం, వ్యవసాయ బీమా పథకాలు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మహిళా రైతులకు సాధికారత, మౌలిక సదుపాయాలను పెంపొందించడం, సేవలను డిజిటలైజ్ చేయడం వరకు ఎన్నో కార్యక్రమాలు జరిగాయని పేర్కొంది.