- పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 5.41 లక్షల ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించా మని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసిందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ అన్నారు. నకిలీ అడ్రస్లతో ఉన్న వారిని, చనిపోయిన, డూప్లికేట్ ఓటర్లను తొలగించి ప్రక్షాళన చేస్తే మంచిదేనని తెలిపారు. అయితే, ప్రక్షాళన పేరు మీద జాబితాలో అసలు ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు జాబితాలో తమ పేరు వెరిఫై చేసుకొని, అందులో లేకపోతే ఎన్నికలకు ముందు నమోదు చేసుకునే అవకాశం కూడా లేదన్నారు. ఎన్నికల రోజున ఎదురయ్యే గందరగోళానికి ఎన్నికల సంఘం భాధ్యత వహించాలన్నారు.