
ట్యాంక్ బండ్, వెలుగు: పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పెన్షనర్ల సంఘాలే ఉద్యమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పేర్కొంది. శనివారం చిక్కడపల్లిలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్ర బాబు, నర్సింగరావు, నరసయ్య మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక సమస్యలపై మంత్రులు చర్చించారని, కానీ పెన్షనర్ల సమస్యలను పట్టించుకోకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు.