మోదీకే ఓటేయాలని జనం ఫిక్స్ అయిన్రు : ఫడ్నవీస్

మోదీకే ఓటేయాలని జనం ఫిక్స్ అయిన్రు :   ఫడ్నవీస్

ముంబై :  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.  ప్రస్తుతం దేశమంతా మోదీ హవా నడుస్తోందని అన్నారు. ఈ మేరకు సోమవారం ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో 40కి పైగా సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు మంచి పని తీరును కనబరచనున్నాయని, బీజేపీ కొన్ని సీట్లను కోల్పోనుందనే వార్తలపై ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.