- సదాశివపేటలో మంత్రి హరీశ్ రావు కామెంట్
- ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరిక
సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని.. అందుకే ఆ పార్టీకి భవిష్యత్ లేదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు కాంగ్రెస్ కౌన్సిలర్లు మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పై విశ్వాసం కోల్పోయారు.. అందుకే కాంగ్రెస్ అధికారంలోలేదు… భవిష్యత్తులో కూడా రాబోదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు సీఎం కేసీఆర్ పై విశ్వాసంతో టీఆర్ఎస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశానికి దిక్సూచి గా మారిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతీ గ్రామంలో డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీ, చెత్త సేకరణ వాహనాలు, ప్రకృతి వనాలు కనిపిస్తున్నాయని, ప్రతీ నెలా పల్లె ప్రగతి కింద నిధులను ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన చెప్పారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెరాస ఆరేళ్ల పాలనలో జరుగుతోందని, పల్లెల్లో ఎక్కడకెళ్లినా స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు తెచ్చింది తమ ప్రభుత్వమేనని, ఈ మార్పులు చూసే కాంగ్రెస్, బీజేపీ ల నుంచి తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సదాశివపేట లో 32 కోట్లతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని, సంగారెడ్డి, సదాశివపేట పట్టణాలకు పట్టణ ప్రగతి కింద ప్రతీ నెలా నిధులను ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతాంగానికి దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. సదాశివపేట బస్టాండ్ అభివృద్ధికి ఇటీవలే 20 లక్షలు విడుదల చేయడం జరిగిందని, జిల్లా మంత్రిగా సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు
యాప్స్తో ప్రైవసీ ఎంత? : యూజర్ల సాలరీ, బిల్లుల వివరాలన్ని యాప్స్ చేతికి..!
ఉత్తరాఖండ్కు.. ఒక్కరోజు సీఎంగా కాలేజీ అమ్మాయి