‘మోడీ @20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ బుక్ రిలీజ్ సభలో అమిత్ షా
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీపై అపారమైన నమ్మకం, ఎనలేని ప్రేమ ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. బుధవారం ఢిల్లీలో ‘మోడీ @20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే పనులే చేస్తుందని, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకోదని అమిత్ షా చెప్పారు.