- పెరిగిన ఎల్పీజీ
ఖాట్మాండు: నేపాల్లో ఇంధన ధరలను ఆ దేశ ఆయి ల్ కార్పొరేషన్ సర్దుబాటు చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై లీటరుకు రూ.2, డీజిల్పై రూ.12 తగ్గిస్తూ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ.214.50, డీజిల్ రూ.222.50కు చేరింది. అదేవిధంగా వంటగ్యాస్, విమాన ఇంధన ధరలను పెంచింది. డొమెస్టిక్ ఫ్యుయెల్పై లీటరుకు రూ.7 పెంచగా.. సిలిండర్పై రూ.150 పెంచింది. దీంతో వంటగ్యాస్ ధర రూ.2,160కు చేరినట్లయింది. పెరిగిన ధరలు శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి అమల్లోకి వచ్చాయని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.
