రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ వాటిని బ్యాంక్లో ఎక్స్ చేంజ్, డిపాజిట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే కొన్ని కిరాణా షాప్లు, వైన్స్, పెట్రోల్ బంకుల్లో రూ.2 వేల నోటును తీసుకోవడం లేదు.
మరికొన్ని పెట్రోల్ బంకుల్లో రూ.2 వేల నోటును తీసుకునేందుకు షరతులు పెడుతున్నారు. వాహనదారుడు రూ.వెయ్యికిపైగా పెట్రోల్ కొట్టించుకుంటేనే రూ.2 వేల నోటును తీస్కుంటామంటూ నోటీసు అంటించారు. - వెలుగు, పద్మారావునగర్