ముదిగొండలో పావురం కలకలం

ముదిగొండలో పావురం కలకలం

ముదిగొండ, వెలుగు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో కాళ్లకు ట్యాగులు, రెక్కలకు రంగు పూసిన పావురం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని న్యూలక్ష్మీపురం గ్రామంలోకి సోమవారం ఉదయం రెక్కలకు రంగు, కాళ్లకు రంగురంగుల ట్యాగులతో ఓ పావురం వచ్చింది. దాన్ని చూసిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవల చైనా మిలిటరీ నిఘా కోసం పావురాలను వాడుతున్నారని, అలాంటిదే తమ గ్రామానికి వచ్చిందని అనుమానించారు. కొద్దిసేపటికి పావురం కాళ్లకు ఉన్న ట్యాగులను పరిశీలించగా పావురాల రేస్​కోసం అలా కట్టినట్లు భావించారు. ట్యాగ్​పై నంబర్లు, ఏపీ, కర్నూల్ అని రాసి ఉండటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సర్పంచ్ కాకదాని కన్నయ్య మాట్లాడుతూ.. ఫారెస్ట్​ఆఫీసర్లకు సమాచారం ఇచ్చామని, పావురాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు.