గాల్లో 145 మంది ప్రాణాలతో చెలగాటం.. మత్తులో విమానం నడిపిన పైలట్‎పై ఎయిర్ ఇండియా వేటు

గాల్లో 145 మంది ప్రాణాలతో చెలగాటం.. మత్తులో విమానం నడిపిన పైలట్‎పై ఎయిర్ ఇండియా వేటు

న్యూఢిల్లీ: డ్రగ్స్ మత్తులో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన పైలట్‎పై ఎయిర్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంది. డ్రగ్ టెస్ట్‎లో పాజిటివ్‎గా తేలడంతో పైలట్‎పై వేటు వేసింది. తక్షణమే అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం (సెప్టెంబర్ 4) ప్రకటించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నివేదిక ఆధారంగా విమాన భద్రత, సిబ్బంది ఫిట్‌నెస్ నిబంధనల ఉల్లంఘనపై ఎయిర్ ఇండియా సంస్థ తీవ్రంగా స్పందిస్తూ ఈ చర్య తీసుకుంది.

అసలేం జరిగిందంటే..?

2026, ఆగస్ట్ 4వ తేదీన ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (AI-2379) విమానం భారీ కుదుపులకు లోనైంది. విమానం అకస్మాత్తుగా 300 అడుగుల ఎత్తు డౌన్ అయ్యింది. ఈ ఘటన సమయంలో ప్లయిట్‎లో  145 మంది ఉండగా.. దాదాపు 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. విమానం గాల్లో ఉండగా మూడు హైడ్రాలిక్ సిస్టమ్స్ ఒకేసారి ఒత్తిడిని కోల్పోవడంతో ఆటోపైలట్ డిస్‌కనెక్ట్ అయి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

►ALSO READ | జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్.. సైన్యం చేతిలో టెర్రరిస్ట్ హతం

 అయితే, విమానం నడిపిన పైలట్ ప్రవర్తనపై అమామానం రావడంతో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అతడికి వైద్య పరీక్షలు నిర్వహించింది. మెడికల్ టెస్ట్‏లో పైలట్‏కు డ్రగ్ పాజిటివ్‎గా తేలింది. ప్రయాణికుల భద్రతా, నిబంధనల ఉల్లంఘనలో భాగంగా పైలట్‎ను ఎయిర్ ఇండియా తక్షణమే విధుల నుంచి తొలగించింది. ప్రయాణికుల భద్రతా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.