ఈడీ విచారణకు హాజరుకానున్న పెలైట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్

ఈడీ విచారణకు హాజరుకానున్న పెలైట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్ : వ్యాపార లావాదేవీలు, బ్లాక్ మనీ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10:30 గంటలకు  బషీర్ బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు 2015 నుంచి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను అందించాలని ఈడీ ఆదేశించడంతో ఈ మేరకు సంబంధిత డాక్యుమెంట్లతో రోహిత్ రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. ఆధార్  కార్డు, పాస్ పోర్టు సహా 10 అంశాలకు సంబంధించిన వివరాలు, విద్యార్హతలు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను సైతం ఈడీ అధికారులు అందించిన ఫార్మాట్ లో సమర్పించాలని చెప్పారు.

పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్హతలపై వివాదం కొనసాగుతోంది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యార్హత పత్రాలతో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇక విదేశీ పర్యటనలకు సంబంధించిన సమాచారాన్ని సైతం అధికారులు అందజేసిన ఫార్మాట్ లో సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నటి రకుల్ ప్రీత్ సింగ్ సైతం విచారణకు హాజరయ్యే అవకాశముంది.