మాకు ఓటేసినా.. వేయకున్నా.. స్కీమ్‌‌లు పోవు

మాకు ఓటేసినా.. వేయకున్నా.. స్కీమ్‌‌లు పోవు
  • ప్లానింగ్ బోర్డు వైస్‌‌చైర్మన్ వినోద్​కుమార్​

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకాలు రద్దు కావని, తమకు ఓట్లేసినా.. ఓట్లేయకున్నా స్కీమ్ లు కొనసాగుతాయని స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఓట్లేయకపోతే స్కీమ్‌‌‌‌లు ఆపేస్తామని తమ పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లుగా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. హుజూరాబాద్‌‌‌‌లోని టీఆర్ఎస్ ఆఫీసులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. ఇల్లందకుంట మండలం సిరిసేడులో శుక్రవారం రాత్రి జరిగిన ఘటనపై వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తమ ఆఫీస్ ముందుకొచ్చి బీజేపీ కార్యకర్తలు నినాదాల చేసినందుకే టీఆర్ఎస్ ​కార్యకర్తలు కోపానికొచ్చారని తెలిపారు.