వికారాబాద్​ – -కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు : సీఎం రేవంత్ ​రెడ్డి

వికారాబాద్​ – -కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు : సీఎం రేవంత్ ​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్​కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సెక్రటేరియట్​లో సీఎం రేవంత్​ను అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో  రాష్ట్రంలోని  రైల్వే లైన్ల అభివృద్ధి, పెండింగ్  రైల్వే లైన్లు, కొత్త లైన్ల ఏర్పాట్లపై చర్చించారు.

గతంలో ప్రతిపాదించిన వికారాబాద్-– కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా చర్చ జరిగింది. ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాలని సీఎం సూచించారు.ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. సమీప ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.