హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ నుంచి ప్లాస్టిక్ పైపు ఊడి కిందపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకేపోవడంతో ప్రమాదం తప్పింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర పెచ్చులు ఊడి.. మహిళ చనిపోయిన ఘటన మరవకముందే ఇది జరిగింది. దీంతో మెట్రో స్టేషన్ కింద నుంచి వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు.