మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు ప్లేట్ మీల్స్ లక్ష కాదు.. రూ.8 వేలే: మంత్రి జూపల్లి

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు ప్లేట్ మీల్స్ లక్ష కాదు.. రూ.8 వేలే: మంత్రి జూపల్లి

మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మిస్ వరల్డ్ పోటీదారులకు  లక్ష రూపాయలకు ప్లేట్ మీల్స్ భోజనం పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..వాళ్లకు పెట్టిన భోజనం ప్లేట్ మీల్స్ రూ.8 వేలేనని జూపల్లి వివరణ ఇచ్చారు. 

 మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా నిర్వహించామన్నారు. ప్రతిష్టాత్మక ఈవెంట్ ను నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని అన్నారు. మిస్ వరల్డ్ పోటీలపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. పోటీదారులు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధం అని చెప్పారు.

అలాగే మిస్ ఇంగ్లండ్  మిల్లా మ్యాగీ ని ఇబ్బందిపెట్టినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు మంత్రి జూపల్లి. ఆమె విమర్శలను ఖండించారు. ఒకవేళ ఇబ్బంది పెడితే ఈవెంట్ ముగిసే వరకూ ఎవరూ ఉండరని అన్నారు. 

►ALSO READ | మిస్ ఇంగ్లాండ్ పై ఏమీ జరగలేదు..ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు: మంత్రి జూపల్లి

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తమ ఆతిథ్యాన్ని మెచ్చి ఈవెంట్ పూర్తయ్యేవరకు సంతృప్తికరంగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదయాలు చూసి మురిసిపోయారని తెలిపారు.