అట్టడుగుస్థాయి నుంచి పనిచేయడం మేయర్ల బాధ్యత

అట్టడుగుస్థాయి నుంచి పనిచేయడం మేయర్ల బాధ్యత

అట్టడుగుస్థాయి నుంచి పనిచేయడం మేయర్లందరి బాధ్యత అని ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ గుజరాత్ లోని గాంధీనగర్ లో బీజేపీ మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఉద్దేశించి ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్లలో పట్టణాభివృద్ధికి సంబంధించిన రోడ్ మ్యాప్ తయారీకి ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు.

దేశ ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారని.. మెరుగైన సదుపాయాలు అందించాలని మోడీ వ్యాఖ్యానించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ ను మేయర్లందరూ అనుసరించాలన్నారు. టైర్ 2, టైర్ 3 నగరాలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయన్నారు. పారిశ్రామిక వాడల అభివృద్ధికి.. డిజిటల్ చెల్లింపులు వాడేలా ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని మోడీ తెలిపారు.