అసోం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోంలో పర్యటనలో భాగంగా కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి ఐక్యత, అభివృద్ధి పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్య, విద్యా రంగానికి సంబంధించిన వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజీ తదితర ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. అభివృద్ధి, నమ్మకమే తమ విధానమన్న ఆయన.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నామన్నారు. అసోంలోని 23 జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించామని మోడీ చెప్పారు. ఈశాన్యంలో శాంతి భద్రతలు మెరుగుపడినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అసోం మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులను ప్రోత్సహించేలా ఉందని అభిప్రాయపడ్డారు.
అసోం మెడికల్ కాలేజీ దిబ్రూఘర్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీ క్యాన్సర్ ఆస్పత్రిని జాతికి అంకితం చేశారు. డిబ్రూఘర్ లోని ఖనికర్ మైదానంలో మరో ఏడు క్యాన్సర్ ఆస్పత్రులకు రతన్ టాటాతో కలిసి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు క్యాన్సర్ ఆస్పత్రులను ప్రారంభించిన మోడీ.. మరో ఏడు క్యాన్సర్ ఆస్పత్రులకు భూమి పూజ చేశారు.
Dibrugarh, Assam | PM Modi along with industrialist Ratan Tata inaugurates 7 state-of-the-Art-Cancer-Centres & lays the foundation stone for 7 new Cancer centres pic.twitter.com/KswK5vBEGs
— ANI (@ANI) April 28, 2022