గ్రీస్‌లో ఒక్కరోజు పర్యటన.. ఏథెన్స్ కు చేరుకున్న ప్రధాని మోదీ

గ్రీస్‌లో ఒక్కరోజు పర్యటన.. ఏథెన్స్ కు  చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న  గ్రీస్ చేరుకున్నారు. 15వ బ్రిక్స్ సమ్మిట్ ముగిసిన తర్వాత మోదీ దక్షిణాఫ్రికా నుండి బయలుదేరి గ్రీస్ చేరుకున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. 

అక్కడ ఒక్కరోజే ఉండనున్న మోదీ... గ్రీస్ ప్రధానితో చర్చలు జరుపుతారు. అనంతరం అక్కడి భారతీయులను కలవనున్నారు.  మోదీ పర్యటన పట్ల గ్రీస్‌లోని ఏథెన్స్‌లోని భారతీయ ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు.

వచ్చే నెల 7 నుంచి 10 వరకూ భారత్‌లో జరిగే జీ-20 సదస్సులో పాల్గొనేందుకు గాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు రానున్నారని శ్వేతసౌధ కార్యాలయం తెలిపింది. వివిధ ప్రపంచ సమస్యలపై జీ20 భాగస్వామ్య దేశాలు చర్చిస్తాయని శ్వేతసౌధ ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌-పియరీ తెలిపారు.