యోగాను  గ్రామాల్లోకి  తీసుకెళ్లాలి: ప్రధాని మోడీ

యోగాను  గ్రామాల్లోకి  తీసుకెళ్లాలి: ప్రధాని మోడీ

యోగాను  గ్రామాల్లోకి  తీసుకెళ్లాల్సిన  టైమ్ వచ్చిందన్నారు  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ.  జార్ఖండ్ రాజధాని  రాంచీలోని  ప్రభాత్ తారా  గ్రౌండ్ లో  నిర్వహించిన   5వ అంతర్జాతీయ  యోగా  దినోత్సవ సంబరాల్లో  మోడీ పాల్గొన్నారు.  ఆధునిక యోగాను సిటీల  నుంచి  గ్రామాల్లోని   పేద, గిరిజనుల  ఇళ్లలోకి   తాను తీసుకెళ్తానని  చెప్పారు. అనారోగ్యాలతో  పేదలకే  ఎక్కువ బాధ  కలుగుతోందన్నారు.  వెల్నెస్ తో  పాటు… అనారోగ్యం  నుంచి  రక్షణ కూడా  అవసరమన్నారు  మోడీ.