మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు తిరంగ డీపీ

మోడీ సోషల్ మీడియా అకౌంట్లకు తిరంగ డీపీ

ఆజాదీ కా అమృత్​మహోత్సవ్ ​కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ ఒక సామూహిక ఉద్యమంగా మారండని ఇటీవలే ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 2 నుంచి 15 తేదీ వరకు దేశ ప్రజలందరూ తమ సోషల్​మీడియా ఖాతాల ప్రొఫైల్​ పిక్చర్​గా జాతీయ జెండా ఫొటో పెట్టుకోవాలని ప్రధాని కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ తన నుంచే ప్రారంభించారు. ఆయనకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు ప్రొఫైల్ పిక్చర్ గా జాతీయ జెండాను పెట్టుకున్నారు. 

 

It is a special 2nd August today! At a time when we are marking Azadi Ka Amrit Mahotsav, our nation is all set for...

Posted by Narendra Modi on Monday, August 1, 2022

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న  సందర్భంగా కేంద్రం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలో అంతా పాల్గొనాలని ప్రధాని ఎప్పటినుంచో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆగష్టు 2 నుంచి 15 వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా డీపీగా త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఆగష్టు 13- నుంచి 15 వ తేదీ వరకు ప్రతి ఇంటి మీదా జాతీయ జెండాను ఎగురవేయాలని మోడీ కోరారు. ఈ ఉద్యమాన్నే ఆయన 'హర్ ఘర్ తిరంగ'గా అభివర్ణించారు. అంతే కాదు జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి కూడా ఆగష్టు 2నే కావడంతో.. ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. ప్రధాని మోడీతో పాటు ప్రముఖ బీజేపీ నేతలు కూడా తన సోషల్ మీడియా ఖాతాలకు త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకున్నారు.