రిషి సునాక్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

రిషి సునాక్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ సమస్యల పై, 2030 రోడ్ మ్యాప్ పై మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ తెలిపారు. భారత్, బ్రిటన్ ల మధ్య చారిత్రక సంబంధాలను ఆధునిక బంధాలుగా మారుద్దాం అని మోడీ తన ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ లోని భారతీయులకు మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

గతంలో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌పై పోటీచేసి ఓటమిపాలైన  రిషి సునాక్  కొద్ది వారాల్లోనే బ్రిటన్ లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఏకగ్రీవంగా ప్రధాని పదవికి ఎన్నికై బ్రిటన్‌ రాజకీయాల్లో సృష్టించారు. అక్టోబర్ 28 న రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చెపట్టనున్నారు. 


రిషి సునాక్ నేపథ్యం ఇదే

రిషి సునాక్ పేరెంట్స్ పేరు యశ్విర్, ఉషా సునాక్. 1950వ దశకంలో వారు ఇండా నుంచి తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు. అక్కడ ఫార్మసిస్టులుగా స్థిరపడ్డారు. అయితే మెరుగైన ఉపాధి అవకాశాలను అన్వేషిస్తూ.. వారు 1960వ దశకంలో బ్రిటన్ లోకి అడుగుపెట్టారు. సౌతాంప్టన్ నగరంలో ఉండగా యశ్విర్, ఉషా సునాక్ దంపతులకు 1980 మే 12న రిషి  జన్మించారు.

రిషి విద్యాభ్యాసం  చాలావరకు బ్రిటన్ లోనే జరిగింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన ఆయనకు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారడంతో 2009 బెంగళూరులో పెద్దల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రిషి, అక్షత దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. 11 ఏళ్ల కృష్ణ, 9 ఏళ్ల అనౌష్క.