మిడతల దాడులను సమర్థవంతంగా అరికట్టాం

మిడతల దాడులను సమర్థవంతంగా అరికట్టాం

35 రకాల కొత్త వంగడాలను జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలాగే ఛత్తీస్ గఢ్ లోని రాయిపూర్ లో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ టోలరన్స్ క్యాంపస్ ను ప్రారంభించారు. వ్యవసాయ రంగంలోని సవాళ్లకు పరిష్కారంగా సైన్స్ అండ్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నారని మోడీ చెప్పారు. గతేడాది దేశంలో అనేకచోట్ల పంటపొలాలపై మిడతల దాడులను సమర్థవంతంగా అరికట్టగలిగామని చెప్పారు. దశలవారీగా 11 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. వాతావరణ మార్పుల కారణగా అనేక కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయన్నారు.