పదవీ కాలం పూర్తి చేసుకోనున్న రామ్​నాథ్​కు వీడ్కోలు విందు

పదవీ కాలం పూర్తి చేసుకోనున్న రామ్​నాథ్​కు వీడ్కోలు విందు

పదవీ కాలం పూర్తి చేసుకోనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి ఢిల్లీలో వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీతలు, గిరిజన నాయకులు హజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము కూడా వీడ్కోలు విందులో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత.. రాష్ట్రపతి రామ్​నాథ్​కు గౌరవంగా విందు ఏర్పాటు చేశామని మోడీ ట్వీట్ చేశారు. దేశం నలుమూలల నుంచి ప్రముఖులను స్వాగతించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.