హైదరాబాదుకు మోడీ..7వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

హైదరాబాదుకు మోడీ..7వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం

ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న మోడీ దాదాపు రూ.7వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించడంతో పాటు స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1410  కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ – మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ. పొడవుతో నిర్మించిన డబుల్ లైన్ను జాతికి అంకితం చేయనున్నారు.

అనంతరం మోడీ రూ.1,850 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. ఆ ఐఐటీ హైదరాబాద్లో రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రారంభిస్తారు. హైదరాబాద్ లో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం ప్రధాని మోడీ కాజీపేటకు వెళ్లనున్నారు. అక్కడ రూ. 521 కోట్లతో నిర్మించనున్న రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపుకు భూమి పూజ చేస్తారు.