మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన మోడీ

మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన మోడీ

దేశం 5జీ యుగంలోకి ప్రవేశించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 5జీ దేశంలో అతిపెద్ద మార్పును తీసుకురాబోతోందన్నారు. ఇవాళ గుజరాత్ లోపర్యటిస్తున్న ప్రధాని.. గాంధీనగర్ లోని అదాలజ్ లో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన పాఠశాలలో పిల్లలతో పాటు కూర్చొని కాసేపు ముచ్చటించారు. ఉపాధ్యాయులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అంతకు ముందు దారిపొడవునా మోడీకి స్థానికులు పూలవర్షం కురిపించారు. స్మార్ట్ సేవలు, స్మార్ట్ క్లాసు రూములు, స్మార్ట్ వాచీల కంటే..5జీ విద్యావ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్తుందన్నారు. విద్యార్థులు వర్చువల్ రియాలిటీ స్వయంగా అనుభవించనున్నారని మోడీ తెలిపారు.