బుడ్డోడితో సరదాగా గడిపిన ప్రధాని మోడీ

బుడ్డోడితో సరదాగా గడిపిన ప్రధాని మోడీ

భారత్-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ త్వరలోనే పూర్తవుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. డెన్మార్క్ తో పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్న తర్వాత రెండు దేశాల ప్రధానమంత్రులు మాట్లాడారు. భారత్-ఫసిఫిక్ తో పాటు.. ఉక్రెయిన్ ఇష్యూపైన చర్చించినట్టు ప్రధాని మోడీ చెప్పారు. భారత్ లో మౌలిక వసతుల రంగంలో, గ్రీన్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడులకు చాలా అవకాశాలున్నాయన్నారు. ఇక.. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతున్నట్టు చెప్పారు డానిష్ ప్రధాని ఫ్రెడెరిక్సన్. రష్యా ఆక్రమణ సరికాదన్నారు. పౌరులను చంపేస్తూ.. రష్యా తీవ్రమైన నేరాలకు పాల్పడుతోందని సీరియస్ అయ్యారు.

ఉదయం జర్మనీలో ఉన్న ప్రధాని మోడీ.. ఓ చిన్నోడితో కాసేపు ఆడుకున్నారు. జర్మనీ టూర్ ముగించుకుని డెన్మార్క్ బయలుదేరుతున్న టైంలో భారతీయులు కొందరు ఆయనను  కలిశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారితో సరదాగా గడిపారు ప్రధాని మోడీ.