కరోనా అంతం కావాలని కాళీ మాతను ప్రార్థించా

కరోనా అంతం కావాలని కాళీ మాతను ప్రార్థించా

ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో ఇవాళ రెండో రోజు పర్యటిస్తున్నారు. చారిత్రక హిందూ దేవాలయాలను ఆయన సందర్శించి… ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ వెళ్లిన మోడీ అక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా శనివారం ఉద‌యం ఆయ‌న సత్కిరా జిల్లా ఈశ్వరీపూర్ లోని జెషోరేశ్వ‌రి కాళీ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఆలయాధికారులు మోడీకి  సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

అమ్మవారి ఆలయంలో కలయ తిరిగిన మోడీ. ఆ తర్వాత నేలపై కూర్చుని  ప్రత్యేక పూజలు చేశారు. చేతితో తయారు చేసిన ప్రత్యేక బంగారు కిరీటాన్ని అమ్మవారికి  అలంకరించారు. ఆలయం లోపలకు వెళ్లేటప్పుడు మాస్క్​ ధరించిన ప్రధాని.. ప్రార్థనలు చేశారు. త్వరగా కరోనా వైరస్ అంతం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.

భారత్​, సరిహద్దు దేశాల్లో ఉన్న 51 శక్తి పీఠాల్లో జెశోరేశ్వరీ కాళీ ఆలయం ఒకటి.