కరోనాకు కులం, జాతీ, మతం లేదు: ప్రధాని మోడీ

కరోనాకు కులం, జాతీ, మతం లేదు: ప్రధాని మోడీ

కరోనా వైరస్ ( కోవిడ్ – 19) కు కులం, రంగు, మతంతో సంబంధం లేకుండా  సోకుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ కులం. జాతి, రంగు, భాష చూడదని.. దేశ సరిహద్దులు కూడా దానికి పట్టవని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజలందరూ ఐక్యత, సోదర భావంతో ఉండాలని అన్నారు. ప్రపంచం మొత్తం ఒకే చాలెంజ్‌ను ఎదుర్కొంటుందని అన్నారు. దేశంలో ఆదివారం వరకు 15వేల మందికి కరోనా సోకిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 23లక్షల మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారని అన్నారు.

ప్రతీ సంక్షోభం ఒక అవకాశాన్ని సృష్టిస్తుందని దాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నారు మోడీ. ఇప్పుడు కోవిడ్ ద్వారా మన సమీకరణాలు ఎలా ఉండాలో కోద్దిరోజులలో తెలుస్తుందని చెప్పారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కొన్ని రోజులలో పరిస్థితులు చక్కబడతాయని ఆయన చెప్పారు.