
ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర పాటిల్ మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు. హిందీలో ఈశ్వరుడి సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. లోక్సభలో మోడీ పేరు ప్రకటించగానే బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరిచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ప్రమాణం చేశాక సభలోని సభ్యులందరికీ రెండు చేతులు జోడించి అభివాదం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులు.. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ప్రధాని తర్వాత లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత సురేశ్ కొడికున్నిల్ ప్రమాణం చేశారు. తర్వాత కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.