మోదీ నిబద్ధత మారలేదు: అనురాగ్ ఠాకూర్

మోదీ నిబద్ధత మారలేదు: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ: ఏండ్లు గడిచి నా ప్రధాని నరేంద్ర మోదీకి పని పట్ల నిబద్ధత ఏ మాత్రం మారలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మోదీ ప్రతి అడుగు వెనక 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యమే ఉందని వెల్లడించారు. శనివారం ఆయన ఢిల్లీలో  2024 ఏడాదికి సంబంధించిన ప్రభుత్వ వార్షిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..గత పదేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ క్యాలెండర్ తెలియజేస్తున్నదని అన్నారు. "తేదీలు, నెలలు మారాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ మోదీకి పని పట్ల నిబద్ధతలో మాత్రం మార్పులేదు. అభివృద్ధి చెందిన దేశం కోసం ఆయన చేసిన ప్రతిజ్ఞ (విక్షిత్ భారత్). ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీతనం మనదేశాన్ని ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాయి" అని అనురాగ్ ఠాకూర్  పేర్కొన్నారు.