ప్రధాని నరేంద్రమోడీ రేపు పశ్చిమబెంగాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రూ.7,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. కోల్కతాలో కొత్తగా ఏర్పాటు చేసిన మెట్రో పర్పుల్ లైన్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. 6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ మెట్రో మార్గం కోసం రూ.2,475 కోట్లు ఖర్చుపెట్టారు. హౌరా స్టేషన్ నుంచి జోకాతరత్లా వరకు ఈ మెట్రోను నిర్మించారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో మెట్రో పర్పుల్ లైన్ను ప్రారంభించనున్నారు.
ఈ నిర్మాణం ద్వారా దక్షిణ కోల్కతాకు చెందిన సర్సునా, డక్ఘర్, ముచిపరాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలగనుంది. ఇందులో భాగంగా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ అరోరా.. ఇప్పటికే పలు మెట్రో స్టేషన్స్లో ప్రయాణీకుల సౌకర్యాలను పరిశీలించారు. ఈ కొత్త మార్గంలో ఆరు స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ ప్రారంభోత్సవానికి ప్రధానితోపాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, గవర్నర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే మెట్రో ప్రారంభోత్సవం జరిగినా ప్రయాణికులకు మాత్రం జనవరి 2వ తేదీ నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.