రేపు తమిళనాడుకు మోదీ ... విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

రేపు తమిళనాడుకు మోదీ ...  విలువైన  ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనతో నూతన సంవత్సరానికి శ్రీకారం చుట్టనున్నారు.  మోడీ రెండు రోజులపాటు తమిళనాడు, లక్షద్వీప్‌లో పర్యటించనున్నారు.  2024 జనవరి 2 మంగళవారం రోజునతమిళనాడులోని తిరుచిరాపల్లి చేరుకుంటారు. అక్కడ భారతీదాసన్‌ వర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ గెస్టుగా మోదీ హాజరుకానున్నారు.  అనంతరం తిరుచిరాపల్లిలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. 

అక్కడ విమానయానం, రైలు, రోడ్డు, చమురు, గ్యాస్, షిప్పింగ్, ఉన్నత విద్యా రంగాలకు సంబంధించి రూ. 19,850 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.  అంతేకాకుండా తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు.  ఇక మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.  అక్కడ  రూ.1,150 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

మరుసటి రోజు అంటే జనవరి 3న కేరళలోని రెండు ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని మోదీ గతేడాది ఏప్రిల్‌లో కేరళలో పర్యటించారు.  అక్కడ  తొలి వందేభారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు.