- మోస్ట్ పాపులర్ లీడర్గా మళ్లీ నరేంద్ర మోడీ
- మార్నింగ్ కన్సల్ట్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ల జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి టాప్లో నిలిచారు. వరుసగా మూడోసారి మోడీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుల జాబితాలో 75% రేటింగ్తో మోడీ టాప్లో నిలిచారు. మోడీ తర్వాత మెక్సికో ప్రెసిడెంట్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్(63%), ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ (54%) ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 22 మంది ప్రపంచ నాయకులపై ఈ సర్వే చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐదో స్థానంలో (41%), ఆరో స్థానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(39%), ఏడో స్థానంలో జపాన్ పీఎం ఫుమియో కిషిడ (38%) ఉన్నారు. 2022 ఆగస్టు 17 నుంచి 23 మధ్య ఆన్లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించి, వివరాలు సేకరించిన ట్లు మార్నింగ్ కన్సల్ట్ పేర్కొంది.