ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కుటుంబ పార్టీలపై పోరాడాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కుటుంబ పార్టీలపై పోరాడాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కుటుంబ పార్టీలపై పోరాడాలన్నారు ప్రధాని మోడీ. రాజస్థాన్ జైపూర్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ బేరర్స్  సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రధాని మోడీ. 8 ఏళ్ల బీజేపీ పాలనలో ఎన్నో అచీవ్ మెంట్స్ సాధించామన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయన్నారు. దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని.. వారి ఉచ్చులో పడొద్దన్నారు. దేశ ప్రయోజనం కోసం.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. గత కొన్ని రోజులుగా ప్రాంతీయ విభేదాలు రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రతి ప్రాంతీయ భాషా, సంస్కృతిని గౌరవిస్తుందన్నారు. ప్రతి ప్రాంతీయ భాషకు తాము ప్రాధాన్యత ఇచ్చామన్నారు.దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. రాబోయే 25 సంవత్సరాలకు బీజేపీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు మోడీ.