ప్రధాని నరేంద్ర మోదీ 2024 మే13న వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించనున్నారు. మరోవైపు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మోదీపై ఈయన పోటీ చేయడం వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
ఈయన మే 10న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏడో దశకు మే 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 14 చివరి రోజు. వారణాసి నియోజకవర్గంలో జూన్ 1 వ తేదీన పోలింగ్ జరగనుంది. మోదీ నామినేషన్ వేసేందుకు వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు కాషాయ వర్గాలు వెల్లడించాయి.
ఈ ర్యాలీకి ముందు ప్రధాని మోదీ.. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. 2014లో మోదీ తొలిసారి వారణాసిలో పోటీ చేసి 56శాతం ఓట్లతో విజయం సాధించి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్ని్కల్లో మోదీకి63 శాతం ఓట్లు వచ్చాయి.