శతవసంతంలోకి ప్రధాని మోడీ తల్లి

శతవసంతంలోకి ప్రధాని మోడీ తల్లి

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ ఈ నెల 18న వందో పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. 1923, జూన్ 18న జన్మించిన హీరాబెన్.... ప్రస్తుతం ప్రధాని మోడీ సోదరుడైన పంకజ్ మోడీతో కలిసి ఉంటున్నారు. అయితే ఇప్పటికే గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ.. తన తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని  గాంధీనగర్ లో ఆమెను కలవనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె పుట్టినరోజు నేపథ్యంలో గుజరాత్ లోని ఓ రోడ్డుకు ఆమె పేరు పెట్టనున్నట్టు సమాచారం. కాగా హీరాబెన్ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందున, రైసెన్ ప్రాంతంలోని 80 మీటర్ల రహదారికి పూజ్య  హీరాబా మార్గ్ అనే పేరు పెట్టాలని తాము నిర్ణయించుకున్నామని.. తద్వారా ఆమె జీవితం నుండి తరువాతి తరం స్ఫూర్తి పొందుతుందని గాంధీనగర్ మేయర్ హితేష్ మక్వానా వెల్లడించారు.