ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలి : ప్రధాని మోడీ

ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలి : ప్రధాని మోడీ

ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం, లభించకుండా కట్టడి చేయాలన్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్ సదస్సులో మాట్లాడిన ప్రధాని.. ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందన్నారు. శ్రీలంకలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు మోడీ. షాంఘై సభ్య దేశాలతో భారత్ మంచి సంబంధాలు కొనసాగిస్తుందని ప్రధాని చెప్పారు.